telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ .. కొత్తగా 1,102 మందికి పాజిటివ్

corona vaccine India

తెలంగాణలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,102 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,930 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరింది. ఆసుపత్రుల్లో 22, 542 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 68,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 693 కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 234 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 81 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Related posts