హైకోర్టులో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ధాఖలైన మూడు పిటిషన్లను కలిపి తెలంగాణ హైకోర్టు విచారించింది. పేద, మధ్యతరగతి వారు ఎల్ఆర్ఎస్ వలన ఇబ్బందులు పడుతున్నారన్న పిటీషనర్స్ హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఎల్ఆర్ఎస్ పై స్టే విధించాలని హైకోర్టును పిటీషనర్స్ కోరినప్పటికి, ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో అక్రమంగా లేఅవుట్లు లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చిందన్న ఏజీ. ఇల్లిగల్ ఎల్ఆర్ఎస్ రహితంగా రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఎల్ఆర్ఎస్ ను తెలుకొచ్చామన్నారు ఏజీ. వన్ టైం మేజర్ కింద అన్ని ఇల్లిగల్ ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేసి భవిష్యత్ లో ఇల్లిగల్ ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు ఏజీ. పూర్తి వివరాలతో ఈ నెల 11న కౌంటర్ ధాఖలు చేస్తామన్న ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు. తదుపరి విచారణ ను హైకోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది.
previous post
next post
మోదీతో గొడవవద్దని చంద్రబాబుకు చెప్పాను.. వినిపించుకోలేదు: అంబికా కృష్ణ