మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐకేపీ గ్రూపులకు అధికారం ఇచ్చేందుకు కేసీఆర్ ఆలోచిస్తారని ఎర్రబెల్లి వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు బయటకు రాలేకపోయారని ఆరోపించారు. ఎన్టీఆర్, కేసీఆర్ ప్రభుత్వాల వల్లే మహిళలకు గౌరవం చేకూరిందని అన్నారు. తెలంగాణలో ఇంకా సమస్యలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్నీ సమస్యలు ఒకేసారి పరిష్కరించలేమని స్పష్టం చేశారు.