telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆచార్య” కథ తనదేనంటున్న మరో రచయిత

Aacharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా మోషన్ పోస్టర్‌ని తన కథ నుంచి కాపీ కొట్టారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే యువ రచయిత ఆరోపిస్తున్నారు. 2006 సంవత్సరంలో తానూ పుణ్యభూమి అనే టైటిల్‌తో ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. అయితే అందులో నుంచే ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనే ఎపిసోడ్‌ తన స్క్రిప్ట్‌ నుంచి తీసుకునన్నారని అయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మరో రచయిత ఈ కథ నాది అంటూ ఆరోపణలు చేశాడు. రాజేశ్ మండూరి అనే రచయిత ‘ఆచార్య’ కథ తనదేనంటూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ మూవీ కథని తానూ రిజిస్టర్ చేయించుకున్నానని, తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తానూ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నానని, చాలా మంది దర్శకుల దగ్గర పని చేశానని, దర్శకత్వం వైపు వెళ్దామనే ఆలోచనతో ‘పెద్దాయన’ అనే టైటిల్‌తో ఈ కథని రాసుకున్నానని, దీనిని బాలయ్యతో చేయాలని అనుకున్నట్టుగా వెల్లడించాడు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ జరిగిన అన్యాయానికి న్యాయం చేయలని కోరుతున్నట్టుగా వెల్లడించాడు. ఇక దీనిపైన ఆచార్య టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Related posts