శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతో మన జనాన్ని కట్టిపడేసింది. నటిగా మంచి పేరు తెచ్చే పాత్రలు ఉన్న సినిమాలే ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ సెట్ చేసుకుంటుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా చేస్తోన్న ‘విరాట పర్వం మూవీలో నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్) తెరకెక్కిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే మూవీలోనూ ఈ న్యాచురల్ బ్యూటీ నాగ చైతన్య పక్కన నటిస్తుంది. అయితే ఇటీవల సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ తనకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హీరోయిన్ కాకుంటే కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని పేర్కొంది. తన గురించి ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా…’మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు’ అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక బాగా ఏడ్చిన సందర్భం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా..’ఎన్జీకే సమయంలో చేసిన సీన్నే ఎక్కువసార్లు రీషూట్ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు మూవీస్ వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను’ అని తెలిపింది.
previous post