telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ విషయాన్ని రహస్యంగా ఉంచొద్దు… మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం… : కొరటాల

koratala

కరోనా వైరస్ సోకితే చనిపోతారనే భయాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ కనీసం టెస్ట్‌లు చేయించుకోవడానికి కూడా ముందుకు రావడంలేదు. దీంతో ఈ వైరస్ వారికి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్లకు వ్యాపించి అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరోనా వైరస్ సోకినవారికి తన విజ్ఞప్తిని తెలియజేశారు దర్శకుడు కొరటాల శివ. ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. “కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటికీ చాలామంది ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఇలా చేయడం కరోనా వైరస్ కంటే ప్రమాదకరం. ఇది చాలా భయంకరమైన అనుభవాన్ని తెలియజేస్తుంది. మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం.. దయచేసి కరోనా సోకిన ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచొద్దు.. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు.. తమను కలిసిన వారికి తెలియజేయండి. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండేదుకే కాకుండా.. మీతో పాటు వాళ్లు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇది నా హృదయపూర్వక అభ్యర్థన” అంటూ ట్వీట్ చేశారు కొరటాల. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Related posts