telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడితే..రాష్ట్రం మొత్తం ఆడినట్లేనా: జీవన్‌రెడ్డి

jeevan-reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడితే రాష్ట్రం మొత్తం ఆడినట్లేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ నెల మొదటి రోజే జీతం తీసుకుని పండగ చేసుకుంటున్నారని.. ఆర్టీసీ కార్మికులు జీతాలు లేకుంటే పండగ ఎలా జరుపుకోవాలని నిలదీశారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లే అన్న కేసీఆర్‌..మరి ఇప్పుడు చేస్తుందేమిటని ధ్వజమెత్తారు. ఏపీలో కొత్తగా ఎన్నికయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కుట్రల పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts