telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : రాణించిన దేవదత్… ఢిల్లీ లక్ష్యం…?

ఐపీఎల్ 2020 లో ఈరోజు చాలా ముఖ్యమైన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అబుదాబి వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఢిల్లీ బౌలర్లు ఆర్సీబీని బాగానే కట్టడి చేసారు. మొదట వికెట్లు ఇవ్వకుండా నిదానంగా ఆడి పరుగులు చేయలేదు బెంగళూరు. కానీ ఓపెనర్ దేవదత్ పాడికల్ (50) ఐపీఎల్ లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత డివిలియర్స్ (35) రాణించడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 కోల్పోయి152 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జే 3 వికెట్లు, కగిసో రబడా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఢిల్లీ 153 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టే టాప్-2 లోకి వెళ్తుంది. కానీ ఢిల్లీ ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. అలాగే బెంగళూరు మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts