telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

స్నేహితుడి భార్యపై అత్యాచారం.. పదేళ్ల జైలుశిక్ష

ARREST crime

నేటి సమాజంలో నైతిక విలువలు మంటగలుస్తున్నాయి. కొందరు కామాంధులు తమ కోరిక తెరుచుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. స్నేహితుడి భార్యను నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హల్వ్‌వాని పట్టణానికి చెందిన రాజ్ అనే యువకుడు దొంగతనం కేసులో జైలుకెళ్లాడు. అక్కడ అతడికి ఓ ఖైదీతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. జైలు నుంచి బయటకు వెళ్లే సమయంలో రాజ్ తన ఫ్రెండ్‌కి బెయిల్ వచ్చేలా చేస్తానని చెప్పాడు.

రాజ్‌ని నమ్మిన ఆ ఖైదీ తన భార్య ఫోన్ నంబర్ ఇచ్చి సంప్రదించాలని కోరాడు.రాజ్ తన ఫ్రెండ్ భార్యకు ఫోన్ చేసి నీ భర్తకు బెయిల్ వచ్చేలా చేస్తానని, ఒకసారి కోర్టు వద్దకు రావాలని కోరాడు. దీంతో ఆమె తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని అక్కడికి వెళ్లింది. అయితే ఆమెపై కన్నేసిన రాజ్.. ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలో ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే బిడ్డను చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేసి వెళ్లిపోయాడు.

కొంత కాలం తర్వాత ఆమె భర్త జైలు నుంచి విడుదల కావడంతో రాజ్ తనపై జరిపిన అఘాయిత్యం గురించి చెప్పి విలపించింది. దీంతో అతడు భార్యను వెంట పెట్టకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాజ్‌ను అరెస్ట్ చేసి సరైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. దీంతో న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Related posts