telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఇక రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు

rtc protest started with arrest

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటి వరకు నగర శివార్లకే పరిమితమవుతున్న ఆర్టీసీ బస్సులను ఇక నుంచి ఇమ్లిబన్ వరకు అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిర్ణయాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

కర్ఫ్యూ అమల్లో ఉండే సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా బస్సులను అనుమతించనున్నారు. రాత్రి సమయంలో బస్సు దిగే వారు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్సు టికెట్ చూపిస్తే సరిపోతుంది. అలాగే, కర్ఫ్యూ సమయంలో తిరిగేందుకు ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైద్రాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

Related posts