ఇవాళ వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసిఆర్ రానున్నారు. కోవిడ్ నేఫథ్యంలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రుల్లో సౌకర్యాలపై నేరుగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న హైద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించి, కోవిడ్ వార్డులో పర్యటించారు. కరోనా భాదితులకు అందుతున్న చికిత్సపై నేరుగా బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. అందులో భాగంగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలను పర్యటించి ప్రభుత్వ ధవాఖానాల్లో అందిస్తున్న వైద్య చికిత్సపై పరిశీలించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత పెద్దనగరంగా విరాజిళ్లుతున్న వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రిని శుక్రవారం పరిశీలిచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ వస్తున్నారన్న ఈ సమాచారంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఎజిఎం ఆసుపత్రిని, సెంట్రల్ జైలును సందర్శించి పరిశీలించారు. నేరుగా కోవిడ్ వార్డులో తిరిగి కరోనా బాదితులతో మాట్లాడారు. ఎంజిఎం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు.
previous post
next post