telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆగస్టు 15 నుంచి రియల్ టైమ్ పరిపాలన: సీఎం కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ చట్టం -2019పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి రియల్ టైమ్ పరిపాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజలేవరూ లంచాలకు ఇవ్వొద్దని, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్రమమైన బిల్డింగ్ కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాంమని చెప్పారు. కొత్త చట్టం కఠినంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వంటి కేసుల్లో చాలా సందర్భాల్లో హైకోర్టు ముందు కూడా తల దించుకోవాల్సి వచ్చిందన్నారు. . అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతంగా పని చేస్తామని చెప్పారు. భారతదేశం అబ్బురపడే విధంగా పని చేయబోతున్నామని తెలిపారు.

Related posts