జీవితంలో ఎంత ఎత్తకు ఎదిగినా, నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపారు. రెండేళ్ల ప్రస్థానంపై లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్ పేరుతో వెంకయ్య పుస్తకారం రాశారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..ఏ హోదాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు దగ్గరగానే ఉన్నానని చెప్పారు.
పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటం బాధకు అనిపిస్తుందన్నారు. ఉపరాష్ట్రపతిని కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. దేశంలో సుమారు 600కు పైగా జిల్లాలను పర్యటించాను. విద్యార్థి దశ నుంచి కూడా దేశవ్యాప్తంగా పర్యటించడమంటే నాకు ఎంతో ఇష్టమని వెంకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, తమిళనాడు సీఎం సీఎం పళని స్వామి, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఓటమిని ఒప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు…