telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాసేప‌ట్లో మునుగోడు ప్రజాదీవెన సభకు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌

*మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభ..

*4 వేల కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరిన సీఎం కేసీఆర్.

*స‌భ‌కు భారీ త‌ర‌లి వ‌చ్చిన జ‌నం

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రజాదీవెన పేరుతో సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కాన్వాయ్ మునుగోడు దారి పట్టింది.  4వేల భారీ కార్ల ర్యాలీతో సీఎం కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో మునుగోడు చేరుకోనున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రజా దీవెన సభకు లక్షన్నర మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అమిత్‌షా సభకు ముందు రోజు కావడంతో.. ఈ సభను టీఆర్‌ఎస్‌ ఛాలెంజ్‌గా నిర్వహిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుంచి భారీ ఎత్తున జనాలను తరలిస్తోంది.

ట్రాఫిక్ ఆంక్షలు..

టీఆర్ఎస్ సభ నేపథ్యంలో మునుగోడులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

మ‌రోవైపు సీఎం కాన్వాయ్ రాకతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Related posts