telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దీక్షను విరమించిన.. డీకే అరుణ ..

dk aruna to hold diksha on liquor ban

రెండురోజులుగా మద్యనిషేధం చేయాలంటూ మహిళా సంకల్ప దీక్షను బీజేపీ నేత డీకే అరుణ విరమించారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దిశా ఘటనతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. మద్యంపై ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకెళుతామని వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించకపోతే తామే తొలగిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. హైవే పక్కన మద్యం షాపులను తొలగించాలని, పర్మిట్ రూంలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో చదివే విద్యార్థులను చైతన్యపరుస్తామని తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా డీకే అరుణ పరాజయం పొందారు. గద్వాల సెగ్మెంట్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బండ కృష్ణమోహన్ చేతిలో పరాజయం చెందారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నేతల నమ్మకాన్ని చంపేశాయి. దీంతో పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. అనంతరం అనూహ్యంగా బీజేపీ కండువా కప్పుకున్నారు.

Related posts