telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్స్ తో జగన్ సంబురపడిపోతున్నారు: దేవినేని ఉమ

Minister Devineni uma fire ys jagan

ఎగ్జిట్ పోల్స్ ఫైలితాలు చూసుకుని, తెలంగాణలో వైసీపీ అధినేత జగన్ సంబరపడిపోతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు.అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని అన్నారు.

ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తాము సంబరాలు చేసుకుంటామని అన్నారు. రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకే ఓటు వేశారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో బలంగా ఉందని స్పష్టమైందన్నారు.

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కొన్ని గంటలు గడిస్తే ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు పై అభ్యర్థులు అవారికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts