telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలుగు రాష్ట్ర హైకోర్టు : .. న్యాయవాదులకు .. న్యాయమూర్తులుగా .. పదోన్నతి..

AP High Court Building started CJI Gogai

తెలుగు రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏడుగురికి పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం వీరిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ ప్రతిపాదనలో ఏపీ హైకోర్టుకు చెందిన టి.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్‌, డి.రమేశ్‌, ఎన్‌.జయసూర్య, తెలంగాణ హైకోర్టుకు చెందిన టి.వినోద్‌కుమార్‌, ఎ.అభిషేక్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ ఉన్నారు. వీరిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని కొలీజియం పేర్కొంది.

Related posts