తెలుగు రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏడుగురికి పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం వీరిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఈ ప్రతిపాదనలో ఏపీ హైకోర్టుకు చెందిన టి.రఘునందన్రావు, బట్టు దేవానంద్, డి.రమేశ్, ఎన్.జయసూర్య, తెలంగాణ హైకోర్టుకు చెందిన టి.వినోద్కుమార్, ఎ.అభిషేక్రెడ్డి, కె.లక్ష్మణ్ ఉన్నారు. వీరిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని కొలీజియం పేర్కొంది.