telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్స‌వం : ఇది అరుదైన ఎప్ప‌టికీ గుర్తుండిపోయే ఘట్టం -సీఎం జగన్‌

విజయవాడలో కోర్టును సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో 100కోట్ల వ్యయంతో 9 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు.

శనివారం సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ (సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి).. ఇవాళ ఒక ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం.. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

2013లో జస్టిస్‌ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని సీఎం జగన్‌ తెలిపారు. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Related posts