టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టు ఊరట కల్పించింది. ఆమెపై నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఆమెను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఈ కేసు లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, వచ్చే నెల 13కి వాయిదా వేసింది. విజయలక్ష్మి తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నించడమే కాకుండా రూ.15 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని