కడప క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో పలువురు దుర్మరణం చెందటం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.