telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

క్వారీలో పేలుడు ఘటనపై సిఎం జగన్ దిగ్భ్రాంతి

cm jagan ycp

కడప క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో పలువురు దుర్మరణం చెందటం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related posts