telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా కల్లోలం : కర్ణాటక మాజీ సీఎం కు పాజిటివ్

చైనా లో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. అయితే ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటే తాజాగా కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ అధినేత కుమార స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని కుమార స్వామి కోరారు. కాగా ఇప్పటికే కర్ణాటక సిఎం బిఎస్ యడ్యూరప్ప కు నిన్న కరోనా సోకింది. నిన్నటితో కరోనా సోకడం బిఎస్ యడ్యూరప్పకు రెండోసారి కావడం ఆందోళనకరమైన అంశం.

Related posts