telugu navyamedia
రాజకీయ వార్తలు

న్యూజీలాండ్ : … అగ్నిపర్వతం పేలిన ఘటనలో .. శవాల వెలికితీతలో ప్రభుత్వం.. 14మృతి..

12 dead bodies found after volcano blast

ఇటీవల న్యూజీలాండ్ లో అగ్నిపర్వతం పేలిన ఘటనలో మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ఆ దేశంలోని వైట్ ఐర్లాండ్‌లో జరిగిన అగ్నిపర్వతం పేలుడు ఘటనలో ఆరుగురి మృతదేహాలను శుక్రవారం ఉదయం మిలటరీ అధికారులు, పోలీసులు కనుగొన్నారు. అగ్నిపర్వతం పేలినపుడు 47 మంది అక్కడ ఉండగా అందులో 14 మంది మరణించారని న్యూజీలాండ్ అధికారులు చెప్పారు. 12 మంది లావా కింద పడి కాలిపోయారు.

ఈ ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడగా వారిని ప్రత్యేక బర్న్ యూనిట్లలో చికిత చేపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం ఆస్ట్రేలియా దేశానికి పంపించారు. న్యూజీలాండ్ దేశంలోని వైట్ ఐర్లాండ్ ప్రాంతంలో తరచూ అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ దీవులను ప్రతిఏటా పదివేలమంది పర్యాటకులు సందర్శిస్తుంటారని న్యూజీలాండ్ అధికారులు చెప్పారు.

Related posts