telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త ..మే నెల నుంచీ పూర్తి వేతనం!

cm jagan ycp

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మే నెల నుంచీ పూర్తి జీతం ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. నేటి సాయంత్రం లేదా రేపటికల్లా సిఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి.

గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించింది.

Related posts