telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేనేమీ కండకావరం ఎక్కిన దొరను కాదు.. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ

aravind bjp mp

నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. రైతులను, కార్మికులను పట్టించుకోకుండా ఉండటానికి తాను కండకావరం ఎక్కడి దొరను కాదని స్పష్టం చేశారు. బోధన్ ఫ్యాక్టరీ చెరుకు రైతులను తాను పట్టించుకోవడం లేదని గులాబీదళానికి చెందిన ఓ ప్యాకేజీ పత్రిక ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న నిజామాబాద్ లోని తన ఇంట్లో మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ రవి శంకర్ గౌడ్ ఉద్యోగులు విజయశాస్త్రి, ముహమ్మద్ సలీం,స్వామితో తాను సమావేశం అయ్యానని తెలిపారు.

అనంతరం మరుసటి రోజున ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో వీరంతా మరోసారి తనను కలిశారనీ, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా కోరారని చెప్పారు. తాను ప్రజా సేవకుడి సైన్యంలో ఓ సేవకుడిని అని చెప్పారు. ప్రజల రక్తం తాగి, పాపపు సొమ్ముతో నడిచే ఓ దినపత్రికలో వచ్చే పిచ్చి రాతలున ప్రజలు నమ్మడం మానేసి చాలా రోజులైందని అన్నారు.

Related posts