telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఐలూరిపల్లెకు చెందిన బేరి శ్రీనివాసులురెడ్డి (53) మాజీ సైనికోద్యోగి. బెంగళూరులోని కుందనహళ్లిలో నివసిస్తున్న ఆయన పదవీ విరమణ అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నెల్లూరులో ఓ హోటల్ రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం భార్య రత్నమ్మ (48), కుమారుడు వెంకటేశ్వరరెడ్డి (28), కోడలు శిరీష (24)తో కలిసి ఆదివారం కారులో బెంగళూరు నుంచి నెల్లూరు బయలుదేరారు.

ఈ క్రమంలో బలిజపల్లి సమీపంలో ఓ ద్విచక్రవాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రత్నమ్మలు ప్రాణాలు కోల్పోగా, శిరీష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారును ఢీకొట్టిన సయ్యద్ హుస్సేన్ (48) కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts