డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. దీంతో పిచ్తో పాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్ పరిస్థితిని మ్యాచ్ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. తొలి సెషన్ను రద్దు చేసినట్లు కూడా బీసీసీఐ మరో ట్వీట్లో స్పష్టం చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటికే టాస పడాల్సి ఉంది. సౌథాంప్టన్లో ఉదయం భారీ వర్షం పడింది. ఇక టాస్ సమయానికి గంట ముందే మరోసారి వరుణుడు పలకరించాడు. దీంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్ పరిస్థితిని మ్యాచ్ అధికారులు పరిశీలించి.. తొలి సెషన్ను రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయని సమాచారం. ఇదే పరిస్థితి ఉంటే.. రెండో సెషన్ కూడా తుడిచిపెట్టుకుపోనుంది. లంచ్ బ్రేక్ 5 గంటలకు షెడ్యూల్ అయి ఉంది. ఆ లోపు వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.
previous post