ఏపీసీఎం జగన్ నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. దీనికోసం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. హోంమంత్రితో భేటీ అనంతరం శుక్రవారం ప్రధానిని కలుస్తారా లేదా అనేది ఖాయం కానున్నట్లు సమాచారం.
కడప స్టీల్ ప్లాంటు ప్రారంభోత్సవానికి ప్రధాని, హోంమంత్రి, ఉక్కుశాఖ మంత్రిని ఆహ్వానించనున్నారు. దీంతోపాటు జనవరి 9న జరిగే అమ్మ ఒడి ప్రారంభ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనున్నట్లు తెలిసింది. వీటితోపాటు పోలవరం, విభజన సమస్యలపైనా చర్చించనున్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం, మద్యం పాలసీ, అంతర్రాష్ట విద్యుత్ బకాయిలు అంశంపైనా వివరించనున్నట్లు తెలిసింది.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా