telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్లైట్ లో మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు..

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా పేరొందిన‌ సూపర్ స్టార్ మహేశ్‌బాబు- నమ్రత శిరోద్కర్ ల పెళ్ళి రోజు నేడు. (ఫిబ్ర‌వ‌రి 10న) ఈ జంట 17వ పెళ్లి రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టాలీవుడ్ సమస్యలు, టికెట్ వివాదంపై పరిష్కారం దిశగా చిరంజీవి, ప్రభాస్‌, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యేందుకు వీరంతా ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి తాడేపల్లికి ఈ ఉదయం వెళ్లారు.

Tollywood

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లి చేరుకున్న విమానంలోనే పుష్పగుచ్చం ఇచ్చి మహేశ్‌కు విషెస్‌ తెలియజేశారు చిరంజీవి.

ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘మహేశ్‌బాబు, నమ్రత ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరూ జీవితాంతం చిరునవ్వులతో సుఖసంతోషంగా ఉండాలి’ అని ట్వీట్ చేస్తూ చిరు ఓ పోటో షేర్ చేశారు.  చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Related posts