మురుగదాస్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం “దర్భార్”. ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ తెలుగు లో విడుదల చేస్తున్నారు. గత రాత్రి దర్భార్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్తో పాటు హరీష్ శంకర్, మారుతి, వంశీపైడిపల్లి, దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. “తమిళ వాళ్ళు నన్నెంత ప్రేమిస్తారో అదే ప్రేమ తెలుగు వాళ్ళు నా మీద చూపించడం నా భాగ్యం. ఇది నా పూర్వ జన్మ సుకృతం. దర్బార్ ఎంటర్టైనింగ్ గా ఉండే మంచి యాక్షన్ థ్రిల్లర్. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అని ఈ సందర్భంగా రజనీకాంత్ అన్నారు. ఈ వేడుకలో “దుమ్ము ధూళి” అనే సాంగ్ విడుదల చేశారు.ఇందులో రజనీకాంత్ స్టెప్పులు ప్రేక్షకులకి పిచ్చెక్కించాయి. మీరు ఈ వీడియోను వీక్షించండి.
previous post
next post