ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రంమూవీ “పుష్ప: ది రైజ్” . కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో రూపొందిన ఈచిత్రం నేడు (డిసెంబర్17) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది.
ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మరియు పుష్ప టీమ్ కి స్పెషల్ విషెస్ తెలిపారు. బన్నీ.. పుష్ప చిత్రం అద్బుతం గా ఉండబోతుంది, ఈ సినిమా కోసం మీరెంతో కష్టపడ్డారు. సుకుమార్ గారు మీ కృషి అసమానమైనది అని అన్నారు. మీ విజన్ మనసుకు హత్తుకునేలా ఉంది. విడుదల కోసం ఎదురు చూస్తున్న రష్మిక మందన్న కి మరియు పుష్ప టీమ్ కి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.
ఈ మేరకు రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ విషెస్ కి ధన్యవాదాలు, త్వరలో ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.
కాగా బన్నీ- సుకుమార్ల హ్యాట్రిక్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. గురువారం (డిసెంబర్ 16) యూఏఈ నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాగా రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు నిర్వహించారు.
తెలంగాణలో కొన్ని థియేటర్లలో పొద్దు పొద్దున్నే బెనిఫిట్ షోల్ పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ పలు థియేటర్లలో ముందస్తు షోలు నిర్వహించారు.ఈ సినిమాలో అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ అందించిన స్వరాలు సూపర్హిట్గా నిలవగా, సమంత ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
Bunny, #Puspha is going be spectacular! Your hardwork is unparalleled 🤗
Sukumar Garu, your vision is mind blowing 🙏
I wish Rashmika and the entire team all the very best for a spectacular release today !
@alluarjun @aryasukku @iamRashmika @MythriOfficial— Ram Charan (@AlwaysRamCharan) December 17, 2021
ఇద్దరి మంచి కోసమే విడిపోయాం – విడాకులపై చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు