ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
పదో తరగతి పరిక్షల షెడ్యూల్’
మే2 నుంచి మే 13 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనున్నాయి..ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.
ఇంటర్ పరిక్షల షెడ్యూల్
ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.
కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నిబంధలను పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.