మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ఆచార్యను పూర్తి చేయడానికి ఎదురుచూస్తున్నారు. ఇది పూర్తి కాగానే మలయాళ చిత్రం లూసిఫర్ను చిరంజీవి రీమేక్ చేయాల్సి ఉంది. సుజిత్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా స్క్రిప్ట్ వర్క్ విన్న చిరంజీవికి ఎందుకనో సంతృప్తిగా అనిపించలేదట. దీంతో ఆయన తర్వాత చూద్దాం అని చెప్పేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య తర్వాత డైరెక్టర్ బాబీ సినిమా చేద్దామనే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నారట. ఆచార్య పూర్తయ్యేలోపు బాబీని స్క్రిప్ట్ వినిపించమని చెప్పారట చిరు. స్క్రిప్ట్ ఓకే కాగానే సినిమాను వీలైనంత త్వరగానే సెట్స్ పైకి తీసుకెళతారని సమాచారం. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
previous post
పెళ్లిపై శృతి హాసన్ స్పందన