telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆమె నా తల్లి కాదు… కానీ ఆ తల్లికి కృతజ్ఞతలు… మెగాస్టార్ ట్వీట్

Chiru

కరోనాపై పోరులో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారని, ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారనే కథనాలు న్యూస్ పేపర్‌లోనే కాకుండా పలు ఛానళ్లలో కూడా దర్శనమివ్వడంతో దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు మాస్క్‌లు రెడీ చేసి అవసరమైన వారికి ఇస్తున్నారు.

Related posts