అగ్రవర్ణ పేదలకు కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్ కోటాలో 5 శాతం కాపులకు ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం అగ్రవర్ణ కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తే, బీజేపీ నేతలు ఒప్పుకోలేదని విమర్శించారు. పేదల10 శాతం రిజర్వేషన్ల పై చట్టం చేసిందనీ, అయితే అందులో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము ఎప్పుడో కోరామని స్పష్టం చేశారు. మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్ ను ఈడబ్ల్యూఎస్ పేదలకు ఇస్తామని తెలిపారు.
అమరావతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ‘ఎలక్షన్ మిషన్ 2019’పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్ కతా భారీ బహిరంగ సభతో బీజేపీ లో వణుకు పుట్టిందన్నారు. కూటమిలో నలుగురు ప్రధానులు ఉన్నారని మోదీ చెప్పడం ఆయన భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏపీకే ఎక్కువ నిధులు ఇస్తున్నామని గడ్కరీ అబద్ధం చెప్పారనీ చంద్రబాబు రోపించారు. ఏపీకి కేవలం టోల్ రహదారులు మంజూరు చేసి ఏదో ఉద్ధరించినట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.