కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడే ను పురస్కరించుకుని కార్మికులకు జీవనోపాధి చూపించాల్సిందిగా ఆమె కోరారు. అదేవిధంగా లాక్డౌన్లో కంపెనీలు ఉద్యోగుల జీతాలను తగ్గించడంపై విచారణ చేపట్టాల్సిందిగా తెలిపారు.
లాక్డౌన్ కారణంగా వారి జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కోట్ల మంది పేద కార్మికుల, కూలీలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.
అందుకే వారు టీఆర్ఎస్ని ఓడించారు: విజయశాంతి