telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

తిరుపతిలో రెచ్చిపోతున్న దొంగలు .. అమ్మాయిని ఎరవేసి నిలువుదోపిడీ!

tirumala temple

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వచ్చిన ఓ భక్తుడు, కొండపైకి ఎక్కకుండానే నిలువు దోపిడీకి గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా రాయచోటికి చెందిన రవి అనే యువకుడు తిరుపతి బస్టాండ్ లో వేచి చూస్తుండగా, కొందరు దుండగులు అతనికి ఓ యువతిని ఎరగా వేశారు. తన వద్దకు వచ్చి తననే చూస్తున్న ఆమెను చూసిన బాధితుడు, మాటలు కలుపగా, ఆమె అతన్ని పక్కకు తీసుకెళ్లింది.

ఈలోగా రవిని చుట్టుముట్టిన ముగ్గురు దుండగులు రూ. 18 వేల నగదు, స్మార్ట్ ఫోన్, వాచ్, క్రెడిట్ కార్డులు, దుస్తులు ఉన్న బ్యాగ్ లను దోచుకెళ్లారు. దీంతో రవి ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని ఆశ్రయించగా, వారి సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకుపోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వారం క్రితం ఇలాంటి ముఠానే తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts