telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

న్యాయవాది దంపతులది రాజకీయ హత్యే…

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చుసిన పెద్దపల్లిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఊరిలోని గుడి విషయమే హత్యకు కారణమే ప్రచారం సాగుతూ వస్తోంది.. అయితే, ప్రతిపక్షాల మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నాయి.. ఇది ముమ్మాటికే రాజకీయ హత్యేనని.. గుడితో సంబంధమేలేదంటున్నాయి.. ఈ విషయంపై స్పందించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు… వామనరావు దంపతుల హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఈ ఘటనపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ గానీ మంత్రులు గానీ స్పందించకపోవడం దుర్మార్గం అని మండిపడ్డ శ్రీధర్‌బాబు.. ఇది గ్రామంలో ఉండే దేవాలయ గొడవ కాదు.. ఖచ్చితంగా రాజకీయ హత్యే అన్నారు. ఇక, హత్య చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని.. అతను గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన మాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేవారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. చూడాలి మరి ఈ కేసులో నిందితులు ఎప్పటికి పట్టుబడతారు అనేది.

Related posts