రైతులకు ఉచిత విద్యుత్ ను దూరం చేయాలన్న యోచనలో కేంద్రం వ్యవసాయ బోర్లకు మీటర్లను బిగించాలని చూస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల బోర్లకు మీటర్లు పెడితే తెలంగాణకు రూ. 2,500 కోట్లు, ఏపీకి రూ. 4 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశపెట్టిందని చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ 4 వేల కోట్లు తెచ్చుకున్నడని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో రైతుల మేలు కోరుకుంటూ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం, తమ రైతులకు మీటర్లు, బిల్లులు వద్దంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించారని అన్నారు. కేసీఆర్ తిరస్కరిస్తే.. జగన్ అంగీకరించారని అన్నారు. మొక్కజొన్నల దిగుమతిపై సుంకాలను తగ్గించడంపైనా కేసీఆర్ మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని తెలిపారు.
ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ