telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం..రెండు కార్లు, పది బైక్‌లు దగ్ధం!

fire accident bldg

హైదరాబాద్ నగరంలోని గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, పది బైక్‌లు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరి పరిధిలోని విష్ణుపురి కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారి విగ్రహం ముందు అఖండ దీపం ఏర్పాటు చేశారు. ఈ దీపం ద్వారా ఒక్కసారిగా మంటలు ఇతర వస్తువులకు అంటుకుని అనంతరం విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు.

మంటలు భారీగా విస్తరించి సెల్లార్‌లోని వాహనాలను చుట్టుముట్టడంతో రెండు కార్లతోపాటు పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన నివాసితులు తమ వాహనాలను పక్కకు తీసేయడంతో మరిన్ని వాహనాలకు మంటలు విస్తరించకుండా ఆపగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Related posts