telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవో 2430ను రద్దు చేసే వరకు పోరాటం: చంద్రబాబు

chandrababu

ప్రజా గొంతుకను నొక్కేసేందుకే ప్రభుత్వం ఈ జీవో 2430ను తీసుకొచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోను రద్దు చేయకుంటే రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వైఫల్యాలను ఎత్తి చూపడమనేది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని అన్నారు.ఇటువంటి జీవోలతో మీడియా సంస్థలను భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఆ జీవోను రద్దు చేసే వరకు పోరాడతామని అన్నారు. అవసరమైతే రోడ్డెక్కేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా ఆయా సంస్థల ఎడిటర్లు, పబ్లిషర్లపై చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వం నిన్న ఓ జీవోను జారీ చేసింది. అలాగే, ఈ జీవో ప్రకారం సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు పోస్టు చేసే వ్యక్తులపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ జీవో పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts