telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కలెక్టర్, ఎస్పీపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

Nallapareddy prasanna kumar Mla

నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో బాధితులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేయడంపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్ విసిరారు.

పేదలను ఆదుకుంటే ఈ రకంగా చేయడం ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు. కలెక్టర్, ఎస్పీలకు రాజకీయాలు చేయాలని ఉంటే… పార్టీల్లో చేరి రాజకీయాలు చేయాలని సూచించారు. పోలీసులు, వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటే మీరు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు అంటూ విమర్శించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పద్ధతి మార్చుకోవాలని నల్లపురెడ్డి హితవు పలికారు

Related posts