telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మా సైనికులపై దాడి చేసింది.. పాకిస్థానే.. : ఇరాన్

iran on pakistan attack on their soldiers

ఇటీవల జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడి కేవలం భారతీయులపైనే కాకుండా, పాకిస్తాన్ సరిహద్దు దేశాలలో కూడా వేడిని పుట్టిస్తుంది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో పాక్ సరిహద్దు దేశం ఇరాన్ కూడా ఆ దేశముష్కరులే తమ సైనికులపై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు అంటూ విరుచుకుపడుతుంది. పాక్ ప్రధాని పూల్వమాపై చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ ఇస్తున్నట్టుగా ఈ సందర్భం ఉండటం విశేషం. ఇటీవల ఆత్మాహుతి దాడికి పాల్పడి 27 మంది ఇరాన్ సైనికులను పొట్టబెట్టుకున్న ఉగ్రవాది పాకిస్థాన్ వాడేనని ఆ దేశం ఆరోపించింది. ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు పెద్దఎత్తున మృతి చెందారు. సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు.

ఇరాన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. తమ సైనికులపై దాడికి పాల్పడింది పాక్ జాతీయుడేనని పేర్కొంది. అంతేకాదు, దాడికి పథక రచన చేసింది కూడా పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ గార్డ్స్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్‌పౌర్ పేర్కొన్నారు. తమ సరిహద్దులో జరుగుతున్న ఉగ్రదాడులు పాక్ పనేనని తరచూ ఆరోపిస్తున్న ఇరాన్ ఈసారి స్వరం పెంచింది. తాజా ఉగ్రదాడి పాకిస్థానీయుల పనేనని తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఈ దాడిలో వారు నేరుగా పాల్గొన్నారని ఆరోపించింది.

Related posts