ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ చంద్రబాబు పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి అప్పట్లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 14 ఏళ్ల క్రితం దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభం కాక ముందే తన వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబునాయుడు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కానీ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా, అక్కడ స్టే లభించింది. ఈ స్టేను ఎత్తివేయాలంటూ నాడు లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ వాయిదా పడింది.
ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా, తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటివరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్