telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆర్కే బీచ్‌లో భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో ట్విస్టు

విశాఖపట్నంలో గత నెల 25న భర్తను ఏమార్చి.. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. .

వివ‌రాల్లోకి వెళితే..

గత జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చిన సాయిప్రియ ..భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ప్రియుడు రవితో కలిసి సాయిప్రియ పరారైన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతరం సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 420, 417, 494, 202 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భ ర్తను వంచించడం, భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండోపెళ్లి చేసుకోవడం, తన గురించి వెతుకుతున్నారని తెలిసీ బాధ్యతారాహిత్యంగా క్షేమ సమాచారం ఇవ్వకపోవడంపై కేసు పెట్టారు.

భ‌ర్త‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ రామారావు వెల్లడించారు.

Related posts