లాక్ డౌన్తో ఇంటికే పరిమితమైన ప్రముఖ తారలంతా తమలో ఉన్న కళా నైపుణ్యాల్ని ప్రదర్శిస్తు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కొందరు వంట చేస్తుంటే మరికొందరు ఇంటి పనులు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ బొమ్మ గీశారు. అయితే ఆయన గీసిన చిత్రం మామూలు వ్యక్తిది కాదు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బ్రహ్మానందం తనలోని చిత్రకారుడిని నిద్రలేపూతూ ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని ఆయన పెన్సిల్ తో గీశారు. ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రంగమార్తాండ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.
Apart from making you laugh till your stomach hurts, #Brahmanandam has a whole other side to him too. He uses time in #quarantine to sketch a portrait of the famous writer #SriSri. pic.twitter.com/l6ABn6XuEW
— Hyderabad Times (@HydTimes) April 19, 2020
సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్