తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాగబాబు కీలక నాయకుడు కావడంతో అధికార పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు నాగబాబు. తాజాగా నాగబాబు వదిలిన ఆ ట్వీట్ ఏమిటంటే ‘ట్రంప్లు అమెరికాలోనే కాదండోయ్.. మన దేశంలో కూడా ఉన్నారు. లక్ ఏంటంటే మన ట్రంప్లకి అమెరికా ట్రంప్కి ఉన్న పవర్ లేక పోవడం మన దేశం చేసుకొన్న అదృష్టం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసారో చెప్పలేదు నాగబాబు. అయితే ఈ ట్వీట్ ప్రధానిని ఉదేశించింది కాదు ఎందుకంటే మన ప్రధానిని ఏకంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్తో పోల్చుతూ ఆకాశానికెత్తేశారు నాగబాబు. ‘భారత దేశాన్ని అగ్ర రాజ్యాంగ నిలబెట్టగలిగే ఒక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానిగా చేసుకోలేక పోయాం. కానీ మన అందరి అదృష్టం మరో ఉక్కు మనిషి మోడీని దేశ ప్రధానిగా ఎన్నుకున్నాం. ఇలాంటి ప్రధాన మంత్రి ఇంకో నాలుగు టర్మ్స్ ఉంటే ఈ దేశానికి ప్రపంచంలో తిరుగు లేదు’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. నాగబాబు పరోక్షముగా జగన్ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారని తెలుస్తోంది. అయితే నాగబాబు చేసిన ట్రంప్ ట్వీట్పై జనసేన, వైసీపీ శ్రేణులు స్పందిస్తూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
Trump లు అమెరికాలోనే కాదండోయ్..మన దేశం లో కూడా ఉన్నారు.లక్ ఏంటంటే మన ట్రంప్ ల కి అమెరికా ట్రంప్ కి ఉన్న పవర్ లేక పోవడం మన దేశం చేసుకొన్న అదృష్టం.
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 20, 2020