telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్ కు కరోనా పాజిటివ్…

ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారు వీరు అనే తేడా లేకుండా అందరికి సోకుతుంది ఈ వైరస్. ప్రజలు అంతా దానికి స‌మాన‌మే అనే రీతితో పంజా విసురుతూనే ఉంది.. తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్‌ క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.. స్వల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింద‌ని.. దాంతో సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లాన‌ని ట్విట్ట‌ర్ తెలిపారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్‌.. ఇక‌, ఇటీవల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో మ‌హ‌మ్మారి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున తాను కోలుకునే వ‌ర‌కు ఇంటి నుంచే విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే మన దేశంల వ్యాక్సినేషన్ పూర్తిగా జరుగుతున్న కేసులు మాత్రం తగ్గడం లేదు.

Related posts