telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మర్డర్ : వర్మపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తండ్రీకూతుళ్లు అయిన అమృత, మారుతీరావు నిజ జీవితంలో జరిగిన కథతో సినిమా ప్రకటించడం, దానికి ‘మర్డర్’ అనే టైటిల్ పెట్టడం, ఆ సినిమాకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేస్తూ ఆసక్తిని కలిగించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వర్మ ఇప్పుడు ‘మర్డర్’ చిత్రానికి సంబంధించి కొత్త చిక్కులను ఫేస్ చేయబోతున్నారు. దీనిపై అమృత మీడియా ముందుకు వచ్చి ఈ సినిమా ఆపాలని విన్నవించుకున్నా వర్మ వినలేదు. దీంతో ఇప్పుడు అమృత మామ, ప్రణయ్ తండ్రి వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు రామ్ గోపాల్ వర్మ‌పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.

Related posts