ఒక అవార్డుల ప్రధానోత్సవంలో ఆలయాలకు పెట్టే ఖర్చును హాస్పిటల్స్, స్కూల్స్లో పెట్టాలని ఇది చాలా ముఖ్యమని జ్యోతిక అన్నారు. హిందూ ఆలయాలపై జ్యోతిక కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఆమె భర్త సూర్యను టార్గెట్ చేస్తున్నారు కొంత మంది. హిందూ ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. వాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా 2018లో సూర్య చేసిన ఒక వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు నటి, కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 కంటెస్టెంట్ గాయత్రి రఘురాం. ఒక వెబ్సైట్లో ప్రచురించిన వార్త స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ సూర్య ఇచ్చిన వాగ్ధానాన్ని ఆమె ప్రశ్నించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 400 టాయిలెట్లకు మరమ్మత్తులు చేసి, వాటిని నిర్వహించే బాధ్యతను తీసుకుంటానని సూర్య చెప్పారు. ఇప్పటి వరకు ఎంత పూర్తి చేశారు ఇది ప్రభుత్వం చేయాల్సిన పనే, కానీ మీరు 2018లో మాటిచ్చారు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకుంది అని గాయత్రి ఘాటుగానే పేర్కొన్నారు.
This interview was given in 2018 – how many done so far? Although it’s government job to do but U have given a word in 2018 we have rights to ask u now. pic.twitter.com/AMV6tJKjFo
— Gayathri Raguramm (@gayathriraguram) April 27, 2020