telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కల్తీమద్యం ఏరులై పారుతోంది: బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

ఏపీలో కల్తీమద్యం ఏరులై పారుతోందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారవుతోందని ఆరోపించారు. అతిపెద్ద లిక్కర్ మాఫియాకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు.

గతంలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో మద్యం సిండికేట్స్ పై పెద్ద యుద్ధం జరిగిందని తెలిపారు. ఆరోజు మద్యం సిండికేట్ లో బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద తలకాయలు ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఈ సిండికేట్ ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్లతో డిస్టిలరీస్ ఏర్పాటు చేసి, బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడాలేని ‘బూమ్’, ‘జార్డిస్ బార్’ బ్రాండ్స్ వంటివి వైసీపీ పది నెలల పాలనలోనే పుట్టుకొచ్చాయన్నారు.

Related posts